Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో నవజాత శిశువు మృతి చెందింది. శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి వార్డులో శనివారం ఉదయం ఓ మహిళ శిశువు జన్మించింది. అయితే, శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ విధి కుక్క ప్రసూతి వార్డులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న శిశువును నోటకరుచుకుని బయటకు ఈడ్చుకెళ్లింది.
దీన్ని చూసిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే కుక్కను తరిమికొట్టారు. దీంతో, శిశువును అక్కడే వదిలేసి కుక్కు బయటకు పరుగులు పెట్టింది. అనంతరం, సిబ్బంది శిశువును ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ఈ తరుణంలో శిశువును పరిశీలించిన వైద్యులు బిడ్డ చనిపోయినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.