Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇంటి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్మెట్ చంద్రబాబునగర్లో నివాసముండే ఏ.మణ్యం ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కోడలు వరలక్ష్మీ(21) కరెంట్ షాక్కు గురైంది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నేరేడ్మెట్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.