Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పై కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. అసత్య పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకొని బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిందన్నారు. రామున్ని కూడా రాజకీయాలలోకి లాగిన దుర్మార్గపు పార్టీ బీజేపీ అని విమర్శించారు. బీజేపీ నేతలకు నీతి, జాతీ ఉంటే అదాని వ్యవహారంపై జేఏసీ వేయాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను దోచుకోవడానికి అదాని ని బీజేపీ అడ్డం పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ నోరు నొక్కాలని బీజేపీ తప్పుడు ఆలోచనలు చేస్తుందన్నారు సీతక్క. మోడీ జీవితం, రాహుల్ గాంధీ జీవితాన్ని జనం ముందు పెడదాం రండి అంటూ సవాల్ విసిరారు.