Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల : విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మెండు సతీష్రెడ్డి 28 వరికోత మిషన్ డ్రైవర్గా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఓ రైతుకు చెందిన వరి పొలాన్ని కోత మిషన్ తో కోస్తుండగా ప్రమాదవశాత్తు 11కెవి విద్యుత్ వైరు తగలడంతో సతీష్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.