Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని నెలవారీ బస్పాస్దారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్పాస్తోటే టోల్ ప్లాజా రుసుం వసూలు చేయనున్నారు. ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ ఆధారంగా నెలవారీ బస్పాస్లు మంజూరు చేయాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేసింది. ఇక టోల్ ప్లాజా రుసుం కూడా బస్పాస్తో పాటే వసూలు చేయనుంది.
ప్రస్తుతం నెలవారీ బస్పాస్దారులకు టోల్ప్లాజా రుసుంను వేరుగా వసూలు చేస్తున్నారు. బస్ పాస్ చూపించి.. ప్రతి రోజూ టోల్ప్లాజా టికెట్ను వారు తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఆ విధానాన్ని సంస్థ ఎత్తివేసింది. ఇక టోల్రుసుంతో పాటే నెలవారీ బస్పాస్ను మంజూరు చేయనుంది. రాష్ట్రంలో 15వేల వరకు నెలవారీ బస్పాస్లున్నాయి. 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి 'మంత్లీ సీజన్ టికెట్' పేరుతో పాస్లను సంస్థ ఇస్తోంది. ఈ పాస్ తీసుకుంటే సాధారణ చార్జీతో పోల్చితే 33 శాతం రాయితీని ఇస్తోంది. 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.