Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పెండ్లికి గిఫ్ట్గా వచ్చిన హోం థియేటర్ పేలి.. నవ వరుడు, ఓ బంధువు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివాహం జరిగిన మూడో రోజునే వరుడు చనిపోవడం పట్ల ఇరువురి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. కబీర్దామ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని హేమేంద్ర మేరవిగా పోలీసులు గుర్తించారు. హేమేంద్రకు రెండు రోజుల క్రితమే పెండ్లి జరిగింది. ఆ పెళ్లిలో అతడికి ఓ హోం థియేటర్ బహుమతిగా వచ్చింది. ఆదివారం దాన్ని బయటకు తీసి కరెంట్ ప్లగ్కు కనెక్షన్ ఇచ్చాడు హేమేంద్ర. వెంటనే హోం థియేటర్ పేలిపోయింది. పేలుడు ధాటికి హేమేంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. హేమేంద్ర బంధువు కూడా ప్రమాదంలో చనిపోయాడు.
ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు వెళ్లేసరికి హేమేంద్ర చనిపోయాడు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. మృతదేహాలను శవ పరీక్షల కోసం పంపించాం. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం అని జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా ఠాకూర్ తెలిపారు.