Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి క్రికెట్కు దూరమైన రిషబ్ పంత్ మళ్లీ మైదానంలో కనిపించే అవకాశముంది! మంగళవారం ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్కు తమ రెగ్యులర్ కెప్టెన్ను తీసుకొచ్చేందుకు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తోంది. అతడు ఫ్రాంఛైజీ యజమానుల ప్రాంతం నుంచి మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉంది. బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రత బృందం అనుమతిస్తే కొంత సమయం అతడు డగౌట్లో కూడా ఉంటాడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.