Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్: తెలంగాణ నిన్న ఉదయం టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్ష స్టార్ట్ అయిన కొద్ది సేపటికే తెలుగు పేపర్ వాట్సాప్ గ్రూప్ లలో ప్రత్యక్షము అయింది. ఈ విషయం మధ్యాహ్నం నుండి తెగ వైరల్ అవుతోంది. తెలిసిన సమాచారం ప్రకారం ఈ పేపర్ లీక్ కు కారణం అయిన ముగ్గురిని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే.. ఈ సంఘటన మరువక ముందే.. తెలంగాణ పదవ తరగతి పరీక్షల్లో మరో సంఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ లో 10వ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయి. ఏకంగా 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలు మాయం అయ్యాయి. ఆదిలాబాద్ లోని ఉట్నూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.