Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. స్వప్నలోక్ ప్రమాదంలో మరణించిన ఆరుగురు మృతుల కుటుంబసభ్యులు ఇవాళ మంత్రి తలసానిని కలుసుకున్నారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయానికి వచ్చిన మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి అందజేశారు. మృతుల కుటుంబాలకు అండా ఉంటుందని భరోసా ఇచ్చారు.