Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఒడిశా
కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు దుకాణాల సముదాయం పూర్తిగా దగ్దమైయినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో వ్యాపారులు రూ. కోట్ల రూపాయల సామాగ్రిని నష్టపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
వాటర్ సప్లై లేని కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. మంటలు చెలరేగడం వల్ల దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది. వ్యాపారులు వారి జీవనాధారమైన దుకాణాలను కోల్పోయారని కెంధూఝర్ జిల్లా సబ్ కలెక్టర్ రామచంద్ర కిస్కు అన్నారు. చివరకు 7-8 గంటల తర్వాత మంటలను ఆర్పివేశారని కెంధూఝర్ జిల్లా సబ్ కలెక్టర్ రామచంద్ర కిస్కు తెలిపారు.