Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమల: తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 24 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,086 మంది భక్తులు దర్శించుకోగా 28,832 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని వివరించారు.