Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ నెల 6వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దకాణాలు మూసి ఉంటాయని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు.