Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరు అయిన విక్టరీ దగ్గుబాటి వెంకటేష్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటేష్ బాబును లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మరణించారు. ఈయన వయసు ప్రస్తుతం 77 సంవత్సరాలు కాగా కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడట. అయితే ఇక ప్రాణంతో పోటీ పడలేక ఈ రోజు ప్రకాశం జిల్లా కారంచేడు లో ఆయువును వదిలేశాడు. వెంటనే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారంచేడు చేరుకొని ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.
కాగా రేపు మోహన్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు జరగనుండగా.. హీరో వెంకటేష్ , హీరో రానాలు కుటుంబాలతో సహా వెళ్లి పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.