Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో బాధ్యులపై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఘటనలో ప్రధాన కారకులుగా గుర్తించి ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసింది. అదేవిధంగా కమలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని సస్పెండ్ చేసింది. సర్వీస్ నుంచి తొలగించిన ఉపాధ్యాయుల్లో వికారాబాద్ జిల్లాకు చెందిన బందెప్ప, సమ్మప్ప, హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన సబియా మడావత్ ఉన్నారు. ప్రశ్నపత్రాన్ని బయటకు చేరవేసిన విద్యార్థిని ఐదేండ్లు డిబార్ చేసింది.