Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై: దేశంలో అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్టుల్లో ఒకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ముంబై ఎయిర్పోర్టుకు ప్రతిరోజూ 970 విమానాలు వచ్చిపోతూ ఉంటాయి. నిత్యం విమానాలు, ప్రయాణికులతో బిజీగా ఉండే ఈ ఎయిర్పోర్టులోని రెండు రన్వేలు మూతపడనున్నాయి. మే 2న ఆర్డబ్ల్యూవై 09/27, 14/32 రన్వేలను తాత్కాలికంగా 6 గంటల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు చేపట్టే నిర్వాహణ, మరమ్మత్తు పనుల కోసం ఈ రెండు రన్వేలను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తున్నామని చెప్పారు. నిర్వాహణ పనుల అనంతరం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.