Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని, ఫలితంగా ఐపీఎల్ మొత్తానికి దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెనైన శ్రేయస్ కనీసం అయిదు నెలలు ఆటకు దూరమవుతాడని భావిస్తున్నారు. ‘‘శ్రేయస్కు విదేశాల్లో శస్త్రచికిత్స జరగనుంది. పూర్తిగా కోలుకోవడానికి అతడికి కనీసం అయిదు నెలలు పట్టొచ్చు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. జూన్ 7న ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా శ్రేయస్ దూరమవుతాడు. అతడు గాయం వల్ల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో ఆడలేకపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్ నుంచి కూడా వైదొలిగాడు. శ్రేయస్ గైర్హాజరీలో ఐపీఎల్లో కోల్కతాకు నితీశ్ రాణా నాయకత్వం వహిస్తున్నాడు.