Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లీకేజీ నిందితుడికి బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో ఇదంతా జరుగుతోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని బీజేపీ చూస్తోందన్నారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.