Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. బండి సంజయ్ తీరును కేసీఆర్ ఎండగట్టనున్నారు. ప్రగతిభవన్లో పలువురు మంత్రులతో కేసీఆర్ భేటీ అయ్యారు.
కొద్ది సేపటి ముందు హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పోలీసులు హాజరుపర్చారు. బండి సంజయ్ లాయర్లను మెజిస్ట్రేట్ పిలిపించింది. బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని న్యాయవాదులు వాదించారు. సంజయ్ తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇరువర్గాల వాదనలు ముగిశాయి. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఉత్తర్వులు వెలువరించనుంది.