Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాని హీరోగా వచ్చిన 'దసరా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల - సుధాకర్ చెరుకూరి దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా, వారం రోజులలోనే 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను 'కరీంనగర్'లో నిర్వహించారు. ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. 'ఇక్కడ ఈ ఎనర్జీ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. 'దసరా' సినిమాను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకి సంబంధించి 100 కోట్ల పోస్టర్ చూడాలని శ్రీకాంత్ అనుకున్నాడు .. అనుకున్నది సాధించాడు. నేను నమ్మి చేసిన ప్రతి కథకు మీరంతా బ్రహ్మరథం పడుతున్నందుకు ఆనందంగా ఉంది' అని అన్నాడు.
ఈ మధ్య కాలంలో ఒక కొత్త సినిమా వస్తుంటే 'ఈ సినిమా ఆడదు చూసుకో' అనేవారు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు. ఈ నెగెటివిటీ అనే చెడుపైన ఈ రోజున మంచి గెలిచింది. 'దసరా' అంటేనే చెడుపై మంచి గెలవడం. ఆ సెలబ్రేషన్ నే ఈ రోజున మనం ఇక్కడ చేసుకున్నాం. ప్రభాస్ .. మహేశ్ బాబు .. రాజమౌళి .. సుకుమార్ గారు ఈ సినిమాను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.