Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: నేడు భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభంకానుంది. తాడ్బండ్ వీరాంజనేయ ఆలయం రాత్రి 8 గంటలకు శోభాయాత్ర ముగింపు కానుంది. హనుమాన్ శోభాయాత్రకు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 850 కెమెరాలతో పోలీసుల నిఘా పెట్టారు. శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నేడు మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు.