Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రేమ పేరిట వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల శ్రీరాంనగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని మ్యాన ప్రియాంక(18)ను చేని సంపత్ అలియాస్ ఓంకార్ ప్రేమపేరుతో తరచూ వేధిస్తుండేవారని. గత డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని అయినప్పటికి వేధింపులు మానలేదని అవి భరించలేక బుధవారం ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణం చెందినట్లు ఆమె తండ్రి మ్యాన రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.