Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. స్నానం చేయించేటప్పుడు నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయిన 23 రోజుల పసికందుకు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చద్లాపూర్లోని మెగా క్యాంప్ కార్యాలంలో బిహార్కు చెందిన ప్రేమ్నాథ్ యాదవ్, కవిత దంపతులకు 23 రోజుల కిందట ఆడ శిశువు జన్మించింది. రోజు మాదిరిగానే ఆ పాపకు కవిత స్నానం చేయిస్తుండగా నీళ్లు మింగి శ్వాస ఆగిపోయింది. బిడ్డ చలనం లేకుండా ఉండటంతో వెంటనే ఏఎన్ఎం, ఆశావర్కర్కు కవిత సమాచారం అందించింది. వెంటనే వాళ్లు 108 నంబర్కి ఫోన్ చేశారు. హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది పాపను పరీక్షించారు. పాప గుండె, నాడి కొట్టుకోవడం లేదని గమనించిన సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారు. దీంతో పాప స్పృహలోకి వచ్చింది. వైద్యుల సూచన మేరకు పాపను సిద్దిపేట జిల్లా దవఖానాకు తరలించారు. సమయానికి స్పందించి పాప ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బందికి కుటుంబసభ్యులు, బంధువులు ధన్యవాదాలు తెలిపారు.