Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వడ్డీ రేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మే నుంచి ఆరు సార్లు రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. కస్టమర్లకు ఉపశమనం కలిగించింది. రేపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.