Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నోటీసు ఇచ్చారు. శామీర్పేటలోని ఈటల నివాసానికి వచ్చిన ఎస్ఐ 160 సీఆర్పీసీ కింద నోటీసు అందజేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరు కావాలని నోటీసులో తెలిపారు.
హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి ముందు రోజే నిందితుడు ప్రశాంత్తో కలిసి కుట్ర చేసినట్లు ఆధారాలు లభించడంతోనే ఎంపీ బండి సంజయ్ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్తోపాటు ఈటల రాజేందర్కు, ఆయన పీఏలకు కూడా పంపాడు. కమలాపూర్లో ముందురోజు తెలుగు బిట్ పేపర్ కూడా బయటికొచ్చినట్లు దర్యాప్తులో తేలింది అని నిన్న మీడియా సమావేశంలో సీపీ వెల్లడించారు. దీంతో ఈటలకు 160 సీఆర్పీసీ కింద నోటీసు అందజేశారు.