Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాంచీ
ఝార్ఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మంత్రికి 2020లో కరోనా సోకి కోలుకున్న అనంతరం ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు.
రాష్ర్ట ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీటర్ వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ‘ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేత మరణంతో పార్టీకి కోలుకోలేని నష్టం జరిగింది. ఈ రోజు రాష్ట్రం ఒక పోరాట వీరుడు, ప్రజల కోసం కష్టపడే నాయకుడ్ని కోల్పోయింది. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోవటం ఎంతో బాధాకరం అన్నారు.