Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ గర్జించింది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(57), శార్దూల్ ఠాకూర్(68) అర్ధ శతకాలతో చెలరేగడంతో 204 రన్స్ స్కోర్ చేసింది. రింకూ సింగ్(46) రాణించాడు. 85 పరుగులకే ఐదు వికెట్లు పడ్డాయి. దాంతో, కోల్కతా 150 ప్లస్ చేయడమే గొప్ప అనిపించింది. కానీ, శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాక సీన్ మారింది. అతడు ధనాధన్ ఇన్నింగ్స్తో స్కోర్ వేగం పెంచాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఫోర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 20 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్స్లతో యాభై రన్స్ సాధించాడు. ఐపీఎల్లో శార్ధూల్కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. రింకూ, శార్దూల్ ఆరో వికెట్కు 103 రన్స్ జోడించారు.