Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోనసీమ : ఆలమూరు మండలం, మూలస్థానం జాతీయరహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 అంబులెన్స్లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి పైకి కారు దూసుకెళ్లింది. బైక్పై వెళుతున్న వ్యక్తికి గాయాలవడంతో చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.