Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విశాఖపట్నం: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైలులో నీటి సౌకర్యం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం రైలు విశాఖపట్నం చేరుకోగానే ప్రయాణికులు కిందికి దిగి నిరసన తెలిపారు. సికింద్రాబాద్ నుంచే నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైలులో నీటి సౌకర్యం కల్పించే వరకు విశాఖపట్నం నుంచి రైలును కదలనీయబోమంటూ రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగారు.