Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు : మాజీ మంత్రి ఎం. రఘుపతి మనవడు, యువనేత అభిషేక్ గురువారం సీనియర్ నేత కేపీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ సమక్షంలో లాంఛనంగా కాంగ్రెస్లో చేరారు. బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ పదవికి, పార్టీకి అభిషేక్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన బిజేవైఎం తమిళనాడు కో ఇన్చార్జిగానూ వ్యవహరించారు. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దినేష్ గుండూరావ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తన వంతు కృషి చేస్తానని అభిషేక్ గురువారం మీడియాకు చెప్పారు. బీబీఎంపీ మాజీ సభ్యుడు మల్లేష్, స్థానిక నేతలు భాను ప్రసాద్, అనిల్ కుమార్ హాజరయ్యారు.