Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే తండ్రి మందలించడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నీలిమాదేవి (23) బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. తండ్రి కోపగించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.