Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో చోటుచేసుకుంది. పట్టణంలో జరుగుతున్న కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్లో శనిగరం ఆంజనేయులు (37) పాల్గొన్నారు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతుడి స్వస్థలం చిగరుమామిడి మండలం సుందరగిరి. ఈ ఘటనతో హుస్నాబాద్లో విషాదం నెలకొంది.