Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధ్యప్రదేశ్: కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న ఒబాన్ అనే మగ నమీబియా చీతాను అధికారులు విజయవంతంగా తీసుకువచ్చారు. గత ఐదు రోజుల క్రితం జాతీయ ఉద్యానవనం నుంచి తప్పించుకోవడంతో అటవీ అధికారులు వేట సాగించారు. ఈ తరుణంలో కునో నేషనల్ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయ్ పూర్ ప్రాంతం కనిపించిందని గ్రామస్థులు వెల్లడించారు. ఆ తర్వాత పర్వాటీ బరోడా గ్రామంలో ఓ నదిలో నీరు త్రాగుతూ కనిపించిందంటూ సమాచారం వచ్చింది. సోషాల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చివరకు చిరుత రాంపురాలో ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు చిరుతకు ట్రాన్కిలైజర్ ఇచ్చి, తిరిగి కునో నేషనల్ పార్కుకు తిరిగి తీసుకువచ్చారు.