Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి మాట్లాడారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే బీజేపీ శక్తిగా తయారైందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ నాయకత్వం చెల్లాచెదురైంది. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియని అయోమయం ఏర్పడింది. బీజేపీ ఎదిగేకొద్దీ కాంగ్రెస్ దిగజారుతూ వచ్చింది. పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకుని కాయకల్ప చికిత్స చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. వాస్తవాలు గ్రహించకుండా మేం చేసిందే సరైనదనే ధోరణి కాంగ్రెస్లో ఉంది. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణన్న సంకల్పం బీజేపీకి ఉందన్నారు.