Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతపురం
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం సమీపంలోని ఓ దుకాణంలో పేలుడు సంబవించి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలకు పెయింటింగ్ వేసే దుకాణంలో పనిచేస్తున్న వాచ్మెన్ సతీష్ పదేళ్ల క్రితం నాటి కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయింది. పేలుడు దాడికి ఆ వ్యక్తి ముక్కలు ముక్కలయ్యాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.