Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ప్రస్తుతం ఓటీటీలో వస్తోన్న కంటెంట్పై అగ్ర కథానాయకుడు సల్మాన్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీలో అశ్లీలత ఎక్కువైందని భావించిన ఆయన.. థియేటర్ల మాదిరిగానే ఓటీటీలకూ సెన్సార్బోర్డ్ ఉండాలని అన్నారు. భారతదేశంలోని నియమ నిబంధలను పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఫిలింఫేర్ అవార్డుల ఆరంభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలి. ఓటీటీ వేదికగా పెరుగుతోన్న అశ్లీల, అసభ్య కంటెంట్ను నిలిపివేయాలి. 15 ఏళ్ల వయసు పిల్లలూ వాటిని చూసే అవకాశం ఉంది. ఒకవేళ మీ పిల్లలే ఇలాంటివి చూస్తే మీరు అంగీకరిస్తారా? కాబట్టి ఓటీటీలోకి వచ్చే కంటెంట్పై పర్యవేక్షణ ఉండాలి. కంటెంట్ ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ ప్రేక్షకాదరణ లభిస్తుంది’’ అని సల్మాన్ పేర్కొన్నారు.
అనంతరం ఆయన ఇలాంటి అశ్లీల కంటెంట్లో నటిస్తోన్న వారిని ఉద్దేశిస్తూ.. ‘‘ఒకవేళ మీరే కనుక మితిమీరిన రొమాన్స్, ఎక్స్పోజింగ్, ముద్దు సన్నివేశాల్లో నటిస్తే.. ఆ దృశ్యాలను మీ ఇంట్లో పనిచేసేవాళ్లు కూడా చూస్తారు. దాని వల్ల మీ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి, హద్దులు దాటిల్సిన అవసరం లేదు. మనం భారతదేశంలో నివసిస్తున్నాం. గతంలో ఇలాంటివి వచ్చి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ మంచి కంటెంట్ను అందించడం కోసం వర్క్ చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.