Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్టాపిక్గా నిలిచే పోసాని కృష్ణమురళి తాజాగా నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నంది పురస్కారలపై అనేక అపోహలున్నాయని.. కులాలు, గ్రూపులుగా అవార్డులు పంచుకున్నారని వెల్లడించాడు. అవి నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులని, కమిటీలో ఉన్న 12మంది సభ్యుల్లో 11మంది కమ్మవారే. అలా తనకు వచ్చిన కమ్మ నంది అవార్డును వద్దనుకున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నందుల అవార్డుల విషయంలో అన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టెంపర్ సినిమాలో పోసాని నటనకు గానూ నంది వరించింది. అయితే ఆ అవార్డును పోసాని తిరస్కరించాడు. కాగా పోసాని కృష్ణ మురళి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్గా బాధ్యతలు కొనసాగిస్తున్నాడు. తాజాగా ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రెస్మీట్లో చలన చిత్ర అభివృద్ధి కోసం త్వరలో సీఎం జగన్ తో చర్చలు జరుపబోతున్నట్లు తెలిపాడు. ఆంధ్రలో సినిమా షూటింగ్స్ చేస్తే నిర్మాతల కు భారం కాకుండా అతి తక్కువగా ఉండేలా చూస్తామని పోసాని తెలిపాడు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎఫ్డిసికి వచ్చి సినిమా తీస్తాను అంటే అన్ని విధాలుగా వాళ్ళకీ సహకరిస్తామని మీడియా సమావేశంలో తెలిపాడు.