Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రధాని మోడీ పర్యటనకు పోలీసుల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మోడీ పర్యటనకు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీస్ సిబ్బంది సహా కేంద్ర బలగలాతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రయిల్ రన్ పూర్తి చేశారు. బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని పర్యటన అడ్డుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చిరించారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ స్టేషన్లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ వేదికగా సికింద్రాబాద్-మహబూబ్నగర్ రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. రూ.720కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, బొల్లారం-మేడ్చల్, ఫలక్నుమా-ఉందానగర్ సెక్షన్లలో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అదే వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే, పోలీసు, రెవెన్యూ, ఫైర్ తదితర విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.