Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బాధిత కుటుంబం డియోరియా జిల్లాకు చెందినది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. శనివారం ఉదయం శ్రీదత్తగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డియోరియా మలుపు గుండా వెళుతున్న కారు ట్రక్కును ఢీకొంది. ఆ సమయంలో కారులో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. ప్రమాదంలో వారంతా కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.