Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రధాని నరేంద్ర మోడి ఈరోజు సికింద్రాబాద్ - తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీఎస్ రెడ్కో ఛైర్మన్ వై. సతీశ్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వందేభారత్ రైళ్లకు దగ్గరగా వెళ్లొద్దని బర్రెలకు విన్నవించారు.
వందేభారత్ రైలును మోడీ ఈరోజు ప్రారంభిస్తున్నారని ఆ రైళ్లు చాలా బలహీనంగా ఉంటాయని, మీరు ఆ రైళ్ల వైపు పొరపాటున కూడా వెళ్లొద్దని, మీరు పొరపాటున ఆ రైళ్లను తాకితే అవి దెబ్బతింటాయన్నారు. ఆవులు, బర్రెలు తగిలితే చిద్రమైపోయే రైళ్లను మోడీ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఆ రైళ్లను ప్రవేశ పెట్టకుండా మోడీని ఎలాగూ ఆపలేమని, అందుకే, మీరే ఆ రైళ్ల వైపు వెళ్లవద్దని బర్రెలకు తెలిపారు.