Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఎమినీ జపరోవా భారత్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఆ దేశానికి చెందిన ఓ మంత్రి ఇండియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఈ తరుణంలో ఇండియా, ఉక్రెయిన్ మధ్య ఉన్న ద్వైపాక్షి అంశాల గురించి మంత్రి చర్చించనున్నారు.
కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి, డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు విక్రమ్ మిశ్రీలతో ఆమె భేటీకానున్నారు. జపరోవా పర్యటన సందర్భంగా భారత విదేశాంగ శాఖ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్తో భారత్కు మంచి సంబంధ, సహకారాలు ఉన్నట్లు పేర్కొన్నది. గడిచిన 30 ఏళ్ల నుంచి దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం రెండు దేశాల మధ్య ఉన్నట్లు తెలిపింది.