Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశమైన కాంగోలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రసంస్థ బాధ్యతవహిస్తూ ప్రకటనచేసింది. బెనీ టెర్రిటరీలోని ముసందబాలో 20 మృతదేహాలను గుర్తించామన్నారు. కాగా, ఉగాండాకు చెందిన అల్లైండ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ గ్రూప్ స్థానికులపై దాడులకు పాల్పడిందని ఆర్మీ అధికారులు ఆరోపించారు. మార్చి 20న కూడా తూర్పు ఇటూరి, ఉత్తర కివు ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. రెండు వేర్వేరు దాడుల్లో 22 మందిని హతమార్చడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను ఎత్తుకెళ్లారు. ఇటూరి ప్రావిన్స్లోని పలుగ్రామాలపై దాడులకు పాల్పడి 12 మందిని ఊచకోతకోశారు. అదేవిధంగా కివు ప్రావిన్స్లో 10 మందిని చంపేశారు.