Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కావలి: చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. బి-5 బోగీ వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. పొగలు వచ్చిన విషయాన్ని తెలుసుకుని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరిరావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. రైల్వే సిబ్బంది మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి బయల్దేరింది.