Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప
వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అలవలపాడులో ఆదివారం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్(8), సాయి తేజ(11), చిన్నారుల మేనమామ శశికుమార్ గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా మిగిలిన ముగ్గురూ ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.