Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెర్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు.