Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధికారిక కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీపై, నేతలపై అవహేళనగా మాట్లాడటం సరికాదని బీఅర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు మండిపడ్డారు. బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో కేకేతో పాటు బీఅర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్రెడ్డి, వెంకటేశ్ నేత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ తరుణంలో కేశవరావు మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదనడం కరెక్టు కాదన్నారు. రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు.
ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినవి ఏవీ కూడా కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్రం ఒక్క వైద్య కళాశాల ఇవ్వనప్పటికీ ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఇచ్చేదిశగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 18 మెడికల్ కళాశాలలు మంజూరు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదంటున్న బీజేపీ నేతలు గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మోడీ సీఎంగా ఉన్న సమయంలో అనేక కార్యక్రమాలకు వెళ్లలేదని గుర్తు చేశారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం బీఅర్ఎస్ ఎంపీల పేర్లు ఎక్కడా పేర్కొనలేదన్నారు. అందుకే ఆ కార్యక్రమానికి బీఅర్ఎస్ ఎంపీలు వెళ్లలేదన్నారు.