Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 60,101 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 79 పాయింట్లు లాభపడి 17,703 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు పైసలు పుంజుకొని 81.96 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, పవర్గ్రిడ్, సన్ఫార్మా, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.