Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
లోక్సభ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 11 మంగళవారం రోజున కేరళలోని తన నియోజకవర్గమైన వయనాడ్ లో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆయన వెంట వెళ్లనున్నారు. వయనాడ్ మాజీ ఎంపీకి ఘనంగా స్వాగతం పలకాలని యూడీఎఫ్ జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా రోడ్ షోతో పాటుగా బహిరంగసభలో రాహుల్ పాల్గొననున్నారు.