Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రైల్వే లైన్లో మరమ్మతులు చేపట్టనున్న కారణంగా ఎగ్మూరు - గురువాయూర్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. మంగళవారం రాత్రి 11.15 గంటలకు గురువాయూర్ నుంచి ఎగ్మూరుకు బయలుదేరే ఎక్స్ప్రెస్ను విరుదునగర్, మానామదురై, కారైక్కుడి, తిరుచ్చి మీదుగా దారి మళ్లించారు. ఈ రైలు మదురై, షోళవందాన్, దిండుగల్, మనప్పారై స్టేషన్లకు వెళ్లదు. అదే విధంగా బుధవారం ఉదయం 9 గంలకు ఎగ్మూరు నుంచి గురువాయూర్ బయలుదేరే ఎక్స్ప్రెస్ తిరుచ్చి, కారైక్కుడి, మానామదురై, విరుదునగర్ స్టేషన్ల మీదుగా పయనించనుంది.