Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వికారాబాద్: తాండూరు మండలం చెన్గెస్పూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వీధి కుక్కల దాడిలో 20 మేక పిల్లలు మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం తాండూరు మండలం చెన్గెస్పూర్ గ్రామానికి చెందిన కురువ శివరాజ్ బతుకుదెరువు నిమిత్తం మేకలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ తరుణంలో సోమవారం మేకలను తీసుకొని అడవికి వెళ్లగా, మేక పిల్లలను ఇంటి దగ్గరే చిన్న గుడారంలో వదిలిపెట్టి వెళ్లాడు. దీనితో ఎవరు లేని సమయంలో గ్రామంలోని కుక్కలు మేక పిల్లలపై తీవ్రంగా దాడి చేయడంతో 20 మేక పిల్లలు మృత్యువాత పడ్డాయి. అప్పులు చేసి మరి కొనుక్కున్న మేకపిల్లలు మృత్యువాత పడటంతో ఆర్థికంగా తీవ్ర నష్టం ఏర్పడినట్లు ఈ సందర్భంగా కురువ శివరాజ్ తెలిపారు.