Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగుళూరు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప షాక్ ఇచ్చారు. మే 10వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అయితే అభ్యర్థులు ప్రకటించడంలో బీజేపీ పార్టీ జాప్యం చేస్తోందని, దాని కారణంగా ఈశ్వరప్ప తన రాజీనామా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఈశ్వర్ప తన లేఖలో తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.